Narendra Modi: అసోంలో తొలి ‘వందే భారత్‌’ రైలు.. నేడే ప్రారంభం!

  • నేటి మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • గువాహటి, న్యూజల్పైగురి మధ్య పరుగులు పెట్టనున్న రైలు
  • అయిదున్నర గంటల్లోనే 411 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి
Modi to flag off northeast regions first vande bharath train in assam

అసోం రాష్ట్ర ప్రజలకు తొలిసారిగా వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గువాహటి-న్యూజల్పైగురి మార్గంలో వందేభారత్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించే క్రమంలో ప్రధాని మోదీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను లాంఛ్ చేయనున్నారు. 

వర్చువల్‌గా జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని, బొంబైగావ్-దుద్నోయ్-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలనూ జాతికి అంకితమిస్తారు. వందేభారత్‌ రైల్లో గువాహటి నుంచి 411 కిలోమీటర్ల దూరంలోని న్యూజల్పైగురికి కేవలం అయిదున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ సర్వీసును వారానికి ఐదు రోజులు నడుపుతామని అధికారులు చెప్పారు.

More Telugu News