Cambodia: ఒకేసారి దాడి చేసిన 40 మొసళ్లు..వృద్ధుడి దారుణ మరణం

  • కాంబోడియాలో దారుణ ఘటన
  • మొసళ్ల పెంపకం చేపట్టిన వ్యక్తి
  • ఓ మొసలి గుడ్లు పెట్టడంతో వాటిని సేకరించేందుకు ప్రయత్నం
  • మొసలిని కర్రతో పక్కకు తోసే క్రమంలో బోనులో పడ్డ వృద్ధుడు
  • బోనులో 40 మొసళ్లు ఒక్కసారిగా దాడి చేయడంతో దారుణ మరణం
40 crocodiles kill cambodian man as he tries to collect eggs

నలభై మొసళ్లు ఒకేసారి దాడిచేయడంతో ఓ వృద్ధుడు నరకయాతన అనుభవించి మరణించాడు. కాంబోడియా దేశంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం, సియెమ్ రీప్ ప్రాంతంలో 75 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మొసళ్లను పెంచుతుంటాడు. ఇటీవల వాటిల్లో ఒకటి గుడ్లు పెట్టడంతో దాన్ని కర్రతో పక్కకు తోలి గుడ్లు తీసుకునేందుకు ప్రయత్నించాడు. 

ఈ క్రమంలో మొసలి వృద్ధుడి చేతిలోని కర్రను పట్టిలాగడంతో ఆయన బోనులో పడిపోయాడు. దీంతో, అక్కడ ఉన్న మొసళ్లన్నీ ఒక్కసారిగా ఆయనపై దాడి చేశాయి. శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ మేరకు స్థానిక పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, సియేమ్ రీప్ ప్రాంతం మొసళ్ల పెంపకానికి ప్రసిద్ధి. మొసళ్ల గుడ్లు, చర్మం, మాంసం కోసం స్థానికులు వీటిని భారీ సంఖ్యలో పెంచుతుంటారు.

  • Loading...

More Telugu News