అవినాశ్ రెడ్డి అరెస్ట్ విషయంలో అందరూ ఓపిక పట్టాల్సిందే: జీవీఎల్ నరసింహారావు
- సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకు అందరూ ఓపిక పట్టాలన్న జీవీఎల్
- ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు సీబీఐ లొంగదని వ్యాఖ్య
- సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తుందన్న జీవీఎల్
మరోవైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. సీబీఐ బృందం కాసేపటి క్రితం హైకోర్టుకు చేరుకుంది. కోర్టు తీర్పు తర్వాత సీబీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు అవినాశ్ రెడ్డి ప్రస్తుతం తన తల్లితో పాటు ఉన్న కర్నూలులోని ఆసుపత్రి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సీబీఐ అధికారలు కూడా కర్నూలుకు చేరుకున్నారు.