పపువా న్యూగినియాలో 14 దేశాధినేతలకు మోదీ ఇచ్చిన విందులో నోరూరించే వంటకాలు ఇవే!
- ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్ కు హాజరైన మన ప్రధాని
- నోరూరించే భారతీయ వంటకాలతో విందును ఏర్పాటు చేసిన మోదీ
- సదస్సుకు హాజరైన నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
మరోవైపు ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కూటమిలో భారత్ తో పాటు 14 పసిఫిక్ ద్వీపాలు ఉన్నాయి. 2014లో తన ఫిజి పర్యటన సందర్భంగా ఈ కూటమిని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో కుక్ ఐలాండ్స్, ఫిజి, కిరిబటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, నౌరూ, నియూ, పలావూ, పవువా న్యూగినియా, సమోవా, సోలోమన్ ఐలాండ్స్, టోంగా, తువాలు, వనుయాటు దేశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ... తమ ఆహ్వానాన్ని గౌరవించి సదస్సుకు హాజరైన 14 దేశాల అధినేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.