నైరుతి రుతుపవనాలు ఏపీని తాకేది ఎప్పుడంటే..!
- ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా కేరళకు రాక
- జూన్ 15న రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం
- ఈసారి సాధారణ వర్షపాతమేనని వాతావరణ శాఖ అంచనా
జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు. కేరళను తాకిన పది రోజుల్లో రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అన్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వివరించారు. అయితే, ఈసారి కూడా ఏపీలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా, కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.