ఇకపై సహించేదిలేదు.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక
- అమరవీరులను అవమానిస్తే ఊరుకోబోమన్న అసీమ్ మునీర్
- దేశ చరిత్రలో చీకటి దినంగా మే 9 మిగిలిపోతుందని వ్యాఖ్య
- సియాల్ కోట్ గారిసన్ లో పర్యటించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
మే 9న జరిగిన విధ్వంసం ప్రీప్లాన్డ్ గా జరిగిందేనని అసీమ్ మునీర్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను, వారి కుటుంబాలను ఎల్లప్పుడూ ఉన్నతంగానే చూడాలని పాక్ ఆర్మీ కోరుకుంటుందని చెప్పారు. వారి గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈమేరకు సియాల్ కోట్ గారిసన్ సందర్శించిన తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.