భుజం నొప్పితో బాధపడుతున్న నారా లోకేశ్.. నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్లో స్కానింగ్
- 50 రోజుల క్రితం లోకేశ్ కుడి భుజానికి గాయం
- ఫిజియోథెరపీ చేసినా ఫలితం శూన్యం
- వైద్యుల సూచనతో స్కానింగ్
నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియోథెరపీ చేయించుకున్నా, వైద్యుల సూచనలు పాటించినా నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటినా నొప్పి వేధిస్తుండడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాల పద్మావతినగర్లోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్కు వెళ్లిన లోకేశ్ అక్కడ స్కానింగ్ చేయించుకున్నారు. కాగా, లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో 103వ రోజుకు చేరుకుంది. ఆయనను చూసేందుకు జనం పోటెత్తడంతో నంద్యాల రోడ్లు కిక్కిరిసిపోయాయి.