Telangana Cabinet: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొత్త సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ

  • ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం
  • ఇటీవలే ప్రారంభమైన కొత్త సచివాలయం
  • క్యాబినెట్ భేటీలో సీఎం, మంత్రులతో పాటు అధికారుల హాజరు
  • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
First Cabinet meeting in new secretariat

ఇటీవలే తెలంగాణ నూతన సచివాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక ఇప్పటివరకు క్యాబినెట్ భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో, ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, చివరిసారిగా తెలంగాణ క్యాబినెట్ భేటీ మార్చి నెలలో జరిగింది.

More Telugu News