కర్ణాటకలో మొదలైన క్యాంపు రాజకీయాలు
- బెంగళూరుకు రమ్మంటూ అభ్యర్థులకు కాంగ్రెస్ పిలుపు
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకూ క్యాంపులోనే ఉండాలని సూచన
- ఆపరేషన్ లోటస్ భయంతో జాగ్రత్తపడుతున్న అధిష్ఠానం
మెజారిటీకి కాస్త అటూఇటూగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ లోటస్ భయంతో, తమ కేండిడేట్లు చేజారిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తప్పకుండా మనకే వస్తుందని, ప్రత్యర్థులు చేసే ప్రలోభాలకు లొంగిపోవద్దని కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే తమ అభ్యర్థులను హెచ్చరించినట్లు తెలిపాయి.