వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చేందుకు షరతు పెట్టిన పాకిస్థాన్
- 2025లో పాక్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరిన పీసీబీ
- ఆసియా కప్ లో భారత్ మ్యాచ్ లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు అంగీకారం
- మొత్తం టోర్నీని యూఏఈలో జరపాలంటున్న బీసీసీఐ
మరోవైపు పాక్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్లో టీమిండియా మ్యాచ్లను యూఈఏలో ఆడించాలన్న ‘హైబ్రిడ్ మోడల్’కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు అయిన జై షా ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ టోర్నీ మొత్తాన్ని తటస్థ వేదికపైనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్తో పాటు 2023 వన్డే వరల్డ్ కప్ విషయంలో సేథి ఏసీసీ, ఐసీసీ అధికారులపై ఒత్తిడి తేవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఆదివారం దుబాయ్ వెళ్తున్నారని సమాచారం. పాకిస్థాన్లో ఆసియా కప్ మ్యాచ్లు లేకుంటే ఆ టోర్నీలో పాక్ జట్టు ఆడబోదని వారికి స్పష్టం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో 2025 చాంపియన్స్ ట్రోఫీకి అయినా టీమిండియా పాక్ కు వస్తుందని హామీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని చెప్పాయి.