Bommireddy Raghavendra Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు

  • వైసీపీలో చేరిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డి
  • ఇద్దరికీ పార్టీ కండువాలు కప్పిన సీఎం జగన్
  • సాదరంగా వైసీపీలోకి ఆహ్వానం
Nellore district TDP leaders joins YSRCP in the presence of CM Jagan

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఇందూరు వెంకటరమణారెడ్డిలను సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు.

More Telugu News