Jai: మరో ప్రేమకథా చిత్రంగా 'మదిలో మది' .. టైటిల్ పోస్టర్ విడుదల!

  • యూత్ కోసం రూపొందిన 'మదిలో మది'
  • శ్రీకాకుళం నేపథ్యంలో నడిచే కథ 
  • కొత్త నటీనటులతో నిర్మితమైన సినిమా 
  • దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రకాశ్ 
Madilo Madi title poster released

స్వచ్చమైన ప్రేమ కథలకు ఎప్పుడూ జనాదరణ ఉంటుంది. ప్రేమకథ లేని సినిమా అనేది ఉండదు. ఏ జోనర్‌లో సినిమాను తీసినా అందులో ప్రేమ కథ ఉండాల్సిందే. అసలే ఇప్పుడు మాస్ మసాలా కమర్షియల్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో ఓ ప్యూర్ లవ్ స్టోరీని  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'మదిలో మది'  అంటూ ఓ అందమైన ప్రేమకథతో సినిమా రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోలో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్- లక్ష్మణ్‌ విడుదల చేశారు. టైటిల్ చాలా కొత్తగా ఉందంటూ మూవీ టీమ్ ను అభినందించారు.

ఈ సినిమాకు కథ .. కథనం .. మాటలు దర్శకత్వం అందించిన ప్రకాష్ పల్ల మాట్లాడుతూ.. 'ఇప్పుడు వస్తున్న కథలకు ఈ సినిమా భిన్నంగా ఉంటుంది.  శ్రీకాకుళం దగ్గర 'తిలారు' అనే గ్రామంలో ఈ సినిమాను తెరకెక్కించాం. లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సరికొత్తగా ఉంటుంది. ఈ కథ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని తొందరలోనే మీ ముందుకు వస్తుంది' అని అన్నారు.

More Telugu News