సెక్రటేరియట్పై నీరు నిలిచింది అనేది అసత్య ప్రచారం: ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ
- కొత్త సచివాలయం నుంచి నీరు నిలిచిందంటూ వీడియో వైరల్
- అది నిజం కాదని తేల్చిన ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ
- ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
‘తెలంగాణ సెక్రటేరియట్పై నీరు నిలిచింది అంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో ప్రజలని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. వీడియోలో కనిపించేది నూతన సచివాలయం బయట నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కాంప్లెక్స్ పై నీరు నిలిస్తే దాన్నిసెక్రటేరియట్పై నీరు నిలిచింది అని వీడియోలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి’ అని ట్వీట్ చేసింది.