లిక్కర్ స్కాం కేసు చార్జిషీటులో ఆమ్ ఆద్మీ ఎంపీ పేరు!
- ఛార్జిషీటులో ఎంపీ రాఘవ్ చద్దా పేరును ప్రస్తావించిన ఈడీ
- మనీశ్ సిసోడియా ఇంట్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎంపీ
- భేటీ గురించి దర్యాఫ్తు సంస్థలకు తెలిపిన సిసోడియా మాజీ కార్యదర్శి
ఈ సమావేశం గురించి మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్... దర్యాఫ్తు సంస్థలకు చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మనీష్ సిసోడియా నివాసంలో జరిగిన భేటీలో చద్దాతో పాటు పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్, విజయ్ నాయర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు అరవింద్ దర్యాఫ్తు సంస్థలకు తెలిపారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంపీ రాఘవ్ పేరును ఈడీ అనుబంధ ఛార్జిషీట్ లో ప్రస్తావించింది.
ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ సంస్థలు దర్యాఫ్తు చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు.