హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. నోటీసులు సస్పెండ్ చేసిన ధర్మాసనం
- ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం నోటీసులు
- రద్దు అంశంపై హైకోర్టు మెట్లు ఎక్కిన అసోసియేషన్
- ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని అసోసియేషన్ వాదనలు
- వాదనల అనంతరం ప్రభుత్వ నోటీసులు రద్దు చేసిన హైకోర్టు
తాము నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని వారి తరఫు న్యాయవాదులు వాదించారు. గతంలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి గవర్నర్ ను కలిశామని, ఈ అంశంపై కూడా ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినట్లు గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం నోటీసును సస్పెండ్ చేసింది. ఉద్యోగుల తరఫున ఉమేష్ చంద్ర, రవిప్రసాద్ వాదనలు వినిపించారు.