ఆదిలాబాద్లో జంట హత్యల కలకలం.. పొలంలో కనిపించిన మహిళ, యువకుడి మృతదేహాలు
- వివాహేతర సంబంధమే కారణమని అనుమానం
- మహిళ బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారన్న కోణంలో దర్యాప్తు
- యువకుడి వయసు 20, మహిళ వయసు 28 సంవత్సరాలు
వివాహమై ఇద్దరు పిల్లలున్న అశ్విని భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో రెహమాన్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. శుక్రవారం వీరిద్దరూ ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలోని స్థానిక పంటపొలంలోకి బైక్పై వెళ్తున్నట్టుగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు లభ్యమయ్యాయి.
ఆ తర్వాత వీరిద్దరూ హత్యకు గురయ్యారు. వారిని తలపై బండరాయితో మోది హతమార్చినట్టు అక్కడున్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. అశ్విని తరపు బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.