కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 47 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ
- 47 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు
- చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద ఢీకొట్టిన లారీ
- 43 మంది ప్రయాణికులకు గాయాలు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితుల్లో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం తదితర పట్టణాలకు చెందిన వారు ఉన్నారు.