టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సిట్ కు హైకోర్టు కీలక ఆదేశం
- దర్యాప్తు వేగవంతం చేయాలని సిట్ కు సూచన
- కేసును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు
- దర్యాప్తు పురోగతిపై జూన్ 5 లోపు నివేదిక ఇవ్వాలన్న న్యాయస్థానం
కేసును సీబీఐకి అప్పగించే విషయమై ఈ సమయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో టీఎస్ పీఎస్సీలోని ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రశ్నించారా?అని అధికారులను ప్రశ్నించింది. తాము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణ పురోగతిపై రిపోర్టును జూన్ 5 లోపు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజు (జూన్ 5)కు వాయిదా వేసింది.