మణిపూర్ సీఎం పాల్గొనే సభా వేదికను తగలబెట్టిన ఆందోళనకారులు
- చురచంద్పూర్ జిల్లాలో ఘటన
- చురచంద్పూర్లో ఇంటర్నెట్ నిలిపివేసి 144 సెక్షన్ విధింపు
- ఈ రోజు జిమ్ కమ్ స్పోర్ట్స్ సౌకర్యాన్ని ప్రారంభించనున్న సీఎం బీరెన్ సింగ్
కాగా, శుక్రవారం మధ్యాహ్నం బీరేన్ సింగ్ ప్రారంభించనున్న న్యూ లాంకాలోని పిటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఆందోళన చేసిన గుంపు పాక్షికంగా తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. హింసాకాండ కారణంగా ముఖ్యమంత్రి కార్యక్రమం రద్దయిందా, లేదా అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఇంకా నిర్ధారించలేదు. కాగా, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్, రక్షిత అటవీ ప్రాంతాలను సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్, ఈ మూక హింసకు నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది.