సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు!

Secunderabad Tirupati Vande Bharat Express Rail Coaches Will Be Double Soon
  • ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు
  • 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు
  • మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు!
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ రైలులో ప్రయాణించేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రైలులో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 8 కోచ్‌లతోనే ఈ రైలు నడుస్తుండగా వీటిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నారు. 

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రస్తుతం 120-130 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. దీంతో చాలామంది ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను రెట్టింపు చేసి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఫలితంగా మరో 10 రోజుల్లోనే అదనపు బోగీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
Go Back to Shorts
Vande Bharat Express
Secunderabad
Tirupati

More Telugu News