జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి... ఐదుగురు జవాన్ల సజీవ దహనం
- పూంచ్ జిల్లాలో ఘటన
- బింభేర్ గలి నుంచి సాంగియోట్ వైపు వెళుతున్న సైనిక వాహనం
- ట్రక్కులో ఒక్కసారిగా మంటలు... కాలిపోయిన సైనికులు
- పిడుగుపడి ఉంటుందని ప్రాథమికంగా అంచనా
- మరింత విచారణ చేయగా... వెల్లడైన ఉగ్రదాడి
- గ్రనేడ్లతో దాడి చేసినట్టు నిర్ధారించిన సైనికాధికారులు
వాహనంపై పిడుగుపడి ఉంటుందని తొలుత భావించారు. అయితే, ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేయడం వల్లే ట్రక్కు మంటల్లో చిక్కుకుందని, జవాన్లు మృతి చెందారని సైనిక అధికారులు నిర్ధారించారు. ఓ జవాను తీవ్రగాయాలపాలవగా, అతడికి రాజౌరీలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.