ప్రభుత్వ వైఫల్యం: భారత జనాభా పెరుగుదలపై అఖిలేశ్ యాదవ్
- జనాభాలో చైనాను దాటి మొదటి స్థానానికి భారత్
- ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నట్లు చెప్పిన యూపీ మాజీ సీఎం
- గర్భనిరోధక పద్ధతులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న అఖిలేశ్
వైద్య సదుపాయాల కొరత కారణంగా శిశుమరణాల భయం కూడా అధిక సంతానానికి దారి తీస్తోందన్నారు. అంతేకాకుండా గర్భనిరోధక పద్ధతులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సరైన చదువు లేకపోవడం వల్ల అధిక జనాభా అనర్థాలను అర్థం చేసుకోకపోవడం కూడా జనాభా పెరుగుదలకు మరో కారణంగా చెప్పారు.
కాగా, 2022 నాటికి భారత్ జనాభా 141.2 కోట్లు కాగా చైనా జనాభా 142.6 కోట్లుగా ఉండేది. అయితే కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. భారత్ లోను కొంత మేర క్షీణత కనిపిస్తోంది. అయితే చైనాతో పోలిస్తే ఇది తక్కువే. దీంతో భారత్ ముందుకు వచ్చింది.