డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్కు ఊరట.. బెయిలు మంజూరు
- డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో డాక్టర్ సైఫ్పై ఆరోపణలు
- అతడి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్న పోలీసులు
- షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన కోర్టు
- 16 వారాలపాటు ప్రతి వారం విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం
అలాగే, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12-2 గంటల మధ్య 16 వారాలపాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశించింది. బాధిత కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని పేర్కొంది. సైఫ్ కనుక నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిలును రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరవచ్చని న్యాయమూర్తి వై.సత్యేంద్ర ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న దరావత్ ప్రీతి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తెల్లవారుజామున విధుల్లో ఉండగానే ఆత్మహత్యకు యత్నించింది. తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ సైఫ్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. ఇప్పుడు అతడికి కోర్టు బెయిలు మంజూరు చేసింది.