యువతి గొంతుకోసి చంపేశాడు.. తాను ఆత్మహత్యాయత్నం

Youth killed girl in chittoor district
  • చిత్తూరు కొండమిట్టలో దారుణం
  • విషమంగానే యువకుడి పరిస్థితి
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
చిత్తూరులో దారుణం జరిగింది. కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని గొంతు కోసి చంపేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడి పేరు చక్రవర్తిగా గుర్తించారు. ప్రశాంతి ఆరు నెలలుగా కొండమిట్ట ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది.

ఈ బ్యూటీ పార్లర్ కు వచ్చిన చక్రవర్తి ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతి ప్రశాంతి ఓ కానిస్టేబుల్ కూతురుగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Chittoor District
girl

More Telugu News