Chandrababu: టీడీపీ జోన్-5 సమావేశం... చంద్రబాబుతో ఆత్మీయంగా జేసీ ఫ్యామిలీ

  • కడపలో టీడీపీ జోనల్ మీటింగ్
  • హాజరైన చంద్రబాబు
  • సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, పరిటాల సునీత
  • చంద్రబాబుకు శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్
JC family members felicitates Chandrababu

కడపలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జోన్-5 సమావేశం జరిగింది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబునాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోన్-5 నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఇతర ముఖ్య నేతలు ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి కూడా వచ్చారు. తండ్రీకొడుకులు వేదికపై చంద్రబాబుతో ఆత్మీయంగా ముచ్చటించడం కనిపించింది. వారు చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. 

అంతకుముందు, సమావేశం ప్రారంభానికి ముందు చంద్రబాబు పార్టీ వ్యవస్థపాక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. కాగా, జోన్-5 సమావేశం అనంతరం కడపలో జరిగే ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం బద్వేలు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

More Telugu News