అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
- వివేకా హత్య కేసులో సహనిందితుడిగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
- తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాశ్
- అవినాశ్ రెడ్డిని రేపు సాయంత్రం విచారణకు పిలవాలని సీబీఐకి సూచన
- హైకోర్టు సూచనకు సీబీఐ అంగీకారం
వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో, అవినాశ్ పిటిషన్ పై రేపు ఉదయం మరోసారి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. కాగా, రేపు మధ్యాహ్నం లోపు అవినాశ్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.