మళ్లీ 10 వేల పైనే కరోనా కేసులు
- గత 24 గంటల్లో 10, 753 కేసుల నమోదు
- 53,720కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
- వైరస్ వల్ల మరో 27 మంది మృతి
ప్రాణాంతక వైరస్ కారణంగా తాజాగా 27 మరణాలు నమోదయ్యాయి. దాంతో, ఇప్పటివరకూ 5,31,091 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఎక్స్ బీబీ.1.16 కారణం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.78 శాతానికి పెరిగింది.