కేసీఆర్ వల్లే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఆలోచనలో పడింది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిన కేంద్రం
- ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేస్తామన్న కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్
- కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ వీవీ లక్ష్మీనారాయణ స్పందన
- తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆకాంక్ష
ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాట్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (బిడ్డింగ్)లో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
కేసీఆర్ వల్లే కేంద్రం ఆలోచనలో పడిందని, తెలంగాణ బృందం రావడం వల్లే ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.