సహకార చక్కెర కర్మాగారాల తరహాలో నిజాం షుగర్స్ పునరుద్ధరిస్తాం: కేటీఆర్
- ఫ్యాక్టరీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
- ఇప్పటికే సిర్పూర్ పేపర్ మిల్లును పున:ప్రారంభించిందన్న మంత్రి
- రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐటీసీతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేయాన్స్ ఫ్యాక్టరీని (బిల్ట్) పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి ఐటీసీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీలను విక్రయించే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కు అలాంటి ఆలోచన లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వాటిని తాము ఉపాధి కల్పించే యూనిట్లుగా, ప్రభుత్వానికి ఆదాయ వనరులు, ఆస్తులుగానే పరిగణిస్తున్నామని, అంతే తప్ప రియల్ ఎస్టేట్ ఆస్తిగా చూడటం లేదని తెలిపారు.