train: దేశంలో తొలి ర్యాపిడ్ రైలు.. ర్యాపిడిక్స్ వచ్చేస్తోంది!

  • ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో పరుగులు పెట్టనున్న సెమీ హై స్పీడ్ రైలు
  • అభివృద్ధి చేస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్
  • 2025 నాటికి పూర్తి స్థాయిలో ప్రారంభించాలని లక్ష్యం
India First Rapid Rail Named RAPIDX Announces NCRTC

దేశంలో మొట్టమొదటి ర్యాపిడ్ రైలు పరుగులు పెట్టనుంది. ఇది ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో నడవనుంది. ఈ మార్గంలోని 82-కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ లో సేవలు అందించనుంది. దీనికి రాపిడిక్స్ అని పేరు పెట్టినట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ప్రకటించింది. పట్టణ మెట్రో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఎన్సీఆర్టీసీ రాపిడిక్స్ ద్వారా దేశంలో మొదటి సెమీ-హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవలకు శ్రీకారం చుట్టనుంది. 

వేగంతోపాటు అధునాతన సాంకేతికతతో నడిచే రాపిడిక్స్ రైలుతో ప్రయాణ సమయం తగ్గనుంది. 2025 నాటికి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఎన్సీఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ముందు ఈ ఏడాదిలో సాహిబాబాద్–దుహై మధ్య 17 కిమీ పొడవైన ప్రాధాన్యతా విభాగంలో నడపాలని చూస్తోంది. ఈ రైలు కోసం మీరట్‌లో ప్రత్యేకంగా 8 స్టేషన్‌లు నిర్మించనుంది.

More Telugu News