శంషాబాద్ ఎయిర్పోర్టులో చివరి నిమిషంలో ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం!
- ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులకు షాక్
- హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు సర్వీసులు రద్దయినట్టు ఎయిర్ ఇండియా ప్రకటన
- రద్దు విషయం ముందస్తుగా చెప్పలేదంటూ ప్రయాణికుల ఆగ్రహం
- టిక్కెట్ డబ్బులు రిఫండ్ ఇస్తామనడంతో శాంతించిన కస్టమర్లు
రద్దు విషయంలో తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టుకు వచ్చాక సర్వీసులు రద్దయినట్టు తమకు తెలిసిందని 48 మంది ప్రయాణికులు మండిపడ్డారు. ఈ క్రమంలో సిబ్బంది, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ సమయం వృథా అయ్యిందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టిక్కెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. చివరకు నిరాశతో వెనుదిరిగారు.