అందరినీ నవ్వించాను .. మా ఇంట్లో మాత్రం తీరని దుఃఖం: నటి శ్రీలక్ష్మి
- తమ్ముడు రాజేశ్ గురించి ప్రస్తావించిన శ్రీలక్ష్మి
- హీరోగా చాలా వేగంగా ఎదుగుతున్నాడని ఆనందించామని వెల్లడి
- అతని మరణం కలచివేసిందని వ్యాఖ్య
- ప్రమాదంలో ఆయన ఇద్దరు పిల్లలు పోయారంటూ ఆవేదన
'రెండుజెళ్ల సీత' సినిమా నుంచి 13 ఏళ్లపాటు 'బెస్ట్ కమెడియన్' గా అవార్డు అందుకుంటూ వచ్చాను. నా తరువాత కొన్నేళ్లకి మా తమ్ముడు రాజేశ్ సినిమాల్లోకి వచ్చాడు. కెరియర్ ను చాలా సీరియస్ గా తీసుకుని ఎదుగుతూ వచ్చాడు. 'రెండుజెళ్ల సీత' .. 'ఆనందభైరవి' ... 'మల్లెమొగ్గలు' వంటి మంచి సినిమాలు చేశాడు" అని చెప్పారు.
"హీరోగా మా రాజేశ్ చాలా ఫాస్టుగా ఎదిగాడు. కానీ ఎంత స్పీడ్ గా వచ్చాడో అంతే స్పీడ్ గా వెళ్లిపోవడం మేము చేసుకున్న దురదృష్టం. రాజేశ్ కి నలుగురు పిల్లలు. ఆ మధ్య జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంతమందిని ఇంత కాలంగా నవ్విస్తూ వచ్చిన మా ఇంట్లో ఈ విషాదకరమైన సంఘటనలేమిటి? అని అనిపిస్తూ ఉంటుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.