తిరుపతికి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు.. టైమింగ్స్, ప్రయాణ సమయం ఇలా..
- ఏప్రిల్ 9న తిరుపతి నుంచి పరుగులు పెట్టనున్న రైలు
- అంతకుముందు రోజు సికింద్రాబాద్లో ప్రారంభం
- 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి
- మంగళవారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
సికింద్రాబాద్లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ (7.19), గుంటూరు జంక్షన్ (9.45), ఒంగోలు (11.09), నెల్లూరు (12.29) స్టేషన్లలో ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నెల్లూరు (5.20), ఒంగోలు (6.30), గుంటూరు జంక్షన్ (7.45), నల్గొండ (8.10) స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.