కొత్త పార్లమెంటును సందర్శించిన మోదీ.. ఫోటోలు ఇవిగో
- గంట సేపు కొత్త పార్లమెంటులో గడిపిన ప్రధాని
- అక్కడ పని చేస్తున్న కార్మికులతో ముచ్చటించిన మోదీ
- 2021 సెప్టెంబర్ లో కూడా ఆకస్మిక తనిఖీ చేసిన వైనం
రూ. 20 వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పార్లమెంటు కూడా ఒక భాగం. కొత్త పార్లమెంటుకు సంబంధించి ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ, భోజన ప్రాంతాలు, వివిధ కమిటీ గదులు, విస్తారమైన పార్కింగ్ స్థలం ఉంటాయి. కొత్త పార్లమెంటును ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి కాదు. 2021 సెప్టెంబర్ లో కూడా ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
