పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ కొడుకుతో అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడికి సంబంధాలు
- ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట
- అమృత్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు దల్జిత్
- దల్జిత్ కు పాక్ ఆర్మీ మాజీ చీఫ్ జావెద్ బజ్వా కుమారుడితో సన్నిహిత సంబంధాలు
అమృత్ పాల్ సింగ్ పై ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద కీలక సమాచారం ఉంది. 30 ఏళ్ల అమృత్ సింగ్ పాక్ కు చెందిన ఐఎస్ఐ సహకారంతో ఇండియాలోకి ఆయుధాలను ఇల్లీగల్ గా తరలిస్తున్నాడు. ఖలిస్థాన్ వేర్పాటు వాద నేత, టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలేకు అమృత్ అనుచరుడు. ఆయనను భింద్రన్ వాలే 2.0 అని కూడా పిలుస్తుంటారు.