ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు
- కవితను నేడు మూడోసారి ప్రశ్నించిన ఈడీ
- 8.30 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ అంటూ కొందరు నేతల పేర్లను ఈడీ పేర్కొంది. అందులో కవిత కూడా ఉన్నారు. ఈ సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట తనయుడు రాఘవ అని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, కవిత వాడిన పది ఫోన్లను ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే తన ఫోన్లన్నంటినీ ఇవాళ కవిత ఈడీ కార్యాలయానికి తీసుకురావడం ఆసక్తి కలిగించింది.