పరీక్ష బాగా రాయలేదని కిడ్నాప్, దాడి డ్రామా ఆడిన పదో తరగతి బాలిక
- ఢిల్లీలో పదో తరగతి సోషల్ పరీక్ష బాగా రాయని 14 ఏళ్ల విద్యార్థిని
- బ్లేడుతో చేయి కోసుకొని, ముగ్గురు అబ్బాయిలు తనపై దాడి చేశారని ఫిర్యాదు
- పోలీసుల కౌన్సిలింగ్ లో అసులు విషయం చెప్పిన బాలిక
పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాలిక ఒంటరిగా తిరుగుతున్నట్లు గుర్తించారు. పోలీసులు బాలికకు కౌన్సెలింగ్ చేయగా, మార్చి 15న తనకు సోషల్ స్టడీస్ పరీక్ష ఉందని, అది సరిగా రాయలేదని వెల్లడించింది. తల్లిదండ్రులు తిడతారని బాలిక చాలా భయపడిందని పోలీసులు తెలిపారు. దీంతో బ్లేడుతో తనను తాను గాయపరుచుకొని కిడ్నాప్ డ్రామా ఆడిందని తెలిపారు. బాలికను మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసినట్టు బాలిక అంగీకరించడంతో కేసు రద్దు చేశారు.