Success: భారత ప్రజాస్వామ్యంపై అక్కసు: ప్రధాని మోదీ

Success of Indias democracy institutions causing envy among some PM Modi
  • ప్రజాస్వామ్య సంస్థలు విజయం సాధించడంతో వ్యక్తుల దాడి
  • మన ప్రజాస్వామ్యం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామన్న ప్రధాని
  • కొత్తదనాన్ని స్వాగతించే సామర్థ్యం ఉండాలన్న అభిప్రాయం
భారత దేశం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించగలదని ప్రపంచానికి చాటి చెప్పినట్టు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య సంస్థలపై కొందరు వ్యక్తులు చేస్తున్న దాడి అవి విజయం సాధించడం వల్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ కేంద్రంగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ వ్యాఖ్యలు చేయడం, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండించడం తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై దాడి, ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంటూ ప్రకటలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అలాంటి  వారిని ఉద్దేశిస్తూ.. ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విమర్శలు చేశారు.

కొందరు వ్యక్తులు మన ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని, అయినా భారత్ ముందుకే ప్రయాణం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఏ దేశ అభివృద్ధి అయినా, విధాన రూపకల్పనలో స్తబ్దత అన్నది అదిపెద్ద అవరోధం. మన దేశంలో వెనకటి తరహా ఆలోచన విధానాలు, కొన్ని కుటుంబాల పరిమితుల కారణంగా మరింత అడ్డంకి నెలకొంది. మనం మరింత ముందుకు వెళ్లాలంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. దేశం ఎదగాలంటే కొత్తదనాన్ని స్వీకరించే సామర్థ్యం ఉండాలి’’అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ సాధించినది ఏదైనా కానీ, అది మన ప్రజాస్వామ్యం శక్తి, మన సంస్థల సామర్థ్యం వల్లేనన్నారు.
Success
Indias democracy
institutions
PM Modi

More Telugu News