హెచ్3ఎన్2 వైరస్ తో దేశంలో మరొకరి మృతి
- భారత్ లో వ్యాపిస్తున్న హాంకాంగ్ ఫ్లూ
- వడోదరలో మహిళ మృతి
- దేశంలో ఇప్పటివరకు ముగ్గురి మృతి
- మార్చి 5 నాటికి 451 కేసుల నమోదు
హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు కూడా కరోనాను పోలి ఉన్నట్టు గుర్తించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు ఐసీఎంఆర్, ఐఎంఏ వెల్లడించాయి. కాగా, జనవరి 2 నుంచి భారత్ లో హెచ్3ఎన్2 కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 5 నాటికి దేశవ్యాప్తంగా 451 కేసులు గుర్తించారు.