యాచకులను నిషేధించిన నాగపూర్ సిటీ
- రోడ్లపై అడుక్కుంటూ కనిపిస్తే ఆరు నెలల జైలు శిక్ష
- ఈ ఆదేశాలు ట్రాన్స్ జెండర్లకూ వర్తిస్తాయని వివరణ
- జి 20 సదస్సు సందర్భంగా పోలీసుల నిర్ణయం
బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని, ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుందని అమితేశ్ వివరించారు. నిషేధాజ్ఞలు పట్టించుకోకుండా ఎవరైనా యాచిస్తూ పట్టుబడితే ఆరు నెలల పాటు జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 19, 20 తేదీలలో జి20 సదస్సు, సి20 సమావేశాలు సిటీలో జరగనున్నాయి. దీంతో నగరంలో యాచకులు, ట్రాన్స్ జెండర్లపై ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. అయితే, ఈ సదస్సులతో పాటు ఇతరత్రా కారణాల వల్లే యాచకులపై నిషేధం విధిస్తున్నట్లు అమితేశ్ తెలిపారు.