భారత్ తడబాటు.. 45 పరుగులకే సగం జట్టు ఢమాల్
- టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- చెలరేగిపోతున్న ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లయన్
- రోహిత్, గిల్, పుజారా, జడేజా, శ్రేయస్ నిరాశ
ఈ దశలో క్రీజులో వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నా.. వికెట్ల పతనం ఆగలేదు. రవీంద్ర జడేజా (4)ను లైయన్ ఔట్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (0)ను కునెమన్ డకౌట్ చేయడంతో భారత్ 11.2 ఓవర్లలో 45 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ తో కలిసి విరాట్ కోహ్లీ పోరాటం కొనసాగిస్తుండగా.. 18 ఓవర్లకు 66/5 స్కోరుతో నిలిచింది. కోహ్లీ, భరత్ పైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది.