కెనడాలోనూ టిక్ టాక్ పై నిషేధం
- గోప్యత, భద్రతా కారణాలను ప్రస్తావించిన కెనడా
- యూజర్ల రక్షణకు తమ ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధాని జస్టిన్ ట్రూడో
- 2020లో మన దేశంలోనూ దీనిపై వేటు
2020లో భారత్ టిక్ టాక్ పై నిషేధం విధించి మొదటి సారి షాక్ ఇచ్చింది. టిక్ టాక్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉండడమే కాదు. భారీగా యూజర్లను ఆకర్షించే తరుణంలో నిషేధానికి గురైంది. గల్వాన్ లోయ దాడి తర్వాత భారత్ టిక్ టాక్ సహా వందలాది చైనా యాప్ లను నిషేధించి గట్టిగా బదులిచ్చింది. కెనడా వాసుల ఆన్ లైన్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. టిక్ టాక్ పై నిషేధం ఈ దిశగా తీసుకున్న చర్యల్లో ఒకటని తెలిపారు.