సైఫ్ ను ఉరితీయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన
- వరంగల్ కేఎంసీ వద్ద విద్యార్థుల ధర్నా
- మెడికల్ కళాశాలల బంద్కు పిలుపు
- స్వగ్రామానికి ప్రీతి మృత దేహం
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, ఐదు రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసి ప్రీతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాకి తరలించారు.