వీడిన మృతదేహాల మిస్టరీ.. వారిద్దరూ కిడ్నాపైన ముస్లింలే!
- హర్యానాలో కిడ్నాపైన రాజస్థాన్ ముస్లింలు
- ఈ నెల 16న జింద్లో ఓ గోశాల వద్ద కారులో కాలిన స్థితిలో మృతదేహాలు
- హర్యానా పోలీసులతో కలిసి నిందితుల కోసం గాలిస్తున్న రాజస్థాన్ పోలీసులు
కాలిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలు సరిపోలినట్టు భరత్పూర్ రేంజ్ ఐజీ గౌరవ్ శ్రీవాస్తవ్ తెలిపారు. నసీర్, జునైద్ కిడ్నాప్ తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని కిడ్నాప్ చేసిన ఎస్యూవీని జింద్లో గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, హర్యానా పోలీసులతో కలిసి పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు.