Yes Bank: ఎస్​బీఐ యోనో యూజర్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ మెసేజ్​లకు అస్సలు స్పందించొద్దు

  • యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్ల సందేశాలు
  • పాన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటూ లింక్స్ పంపిస్తున్న వైనం
  • ఆ లింక్స్ ను తెరవొద్దంటున్న ఎస్బీఐ
Alert for SBI YONO fake message scam

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తమ వినియోదారులపై సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ యోనో యాప్ వాడుతున్న వారిని టార్గెట్ చేశారు. యోనో విషయంలో వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని  ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సూచించింది. ‘ప్రియమైన ఎస్‌బీఐ వినియోదారుడా‌, మీ యోనో ఖాతా  బ్లాక్ అవుతుంది. పాన్‌ నెంబర్‌‌ను అప్‌డేట్ చేసుకోవడానికి  ఈ కింద లింక్‌ను క్లిక్ చేయండి ’ అంటూ మోసపూరిత సందేశాలను పంపుతూ ఎస్‌బీఐ వినియోగదారులను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని  పేర్కొంది. ఇటువంటి సందేశాలు, ఈమెయిల్స్‌కు స్పందించవద్దని సూచించింది. సైబర్ నేరగాళ్లు పంపే ఈ సందేశాల్లోని లింక్స్ ఓపెన్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం అవుతాయని తెలిపింది. 

ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే report.phishing@sbi.co.in లో రిపోర్ట్ చేయాలని పీఐబీ ప్రజలకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాతా నెంబర్, పాస్‌వర్డులు, ఓటీపీ సహా ఇతర సున్నిత, వ్యక్తిగత సమాచారాన్ని మెసేజ్ ల రూపంలో పంపొద్దని ఎస్‌బీఐ చెబుతోంది. సైబర్ నేరగాళ్లు తమ లింక్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసం చేస్తారని తెలిపింది.  ఏదైనా సైబర్ నేరం గురించి నేరుగా ఫిర్యాదు చేయాలంటే 1930 నెంబర్‌‌కు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపింది.

More Telugu News