అభిమానులకు భారత కెప్టెన్ హర్మన్ భావోద్వేగ సందేశం
- టీ20 ప్రపంచ కప్ సెమీస్ లోనే ఓడిన భారత్
- ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం
- బలంగా తిరిగొస్తామంటూ హర్మన్ ట్వీట్
టోర్నీలో తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ జట్టు ఓడిపోవడం బాధగా ఉందని తెలిపింది. హృదయ విదారక ఓటమి తర్వాత భారత జట్టు బలంగా పుంజుకుంటుదని, మైదానంలో గొప్ప ప్రదర్శన కనబరుస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఈ ప్రపంచకప్లో మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ జట్టు ఓటమిని చూడటం ఎంత బాధగా ఉంటుందో క్రికెట్ అభిమానిగా నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే మేం బలంగా తిరిగి వస్తాం. గొప్ప ప్రదర్శన చేస్తాం’ అని కౌర్ ట్విట్టర్లో పేర్కొంది.