తారకరత్నకు నివాళులు అర్పించడానికి మోహన్ బాబు రాకపోవడానికి కారణం ఇదే!
- ప్రస్తుతం తాను లండన్ లో ఉన్నానన్న మోహన్ బాబు
- మంచు విష్ణు సింగపూర్ లో ఉన్నాడని వెల్లడి
- దీనివల్లే నివాళి అర్పించేందుకు రాలేకపోయామన్న మోహన్ బాబు
దీంతో ఆయన ఎందుకు రాలేదనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. దీనికి ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాను లండన్ లో, మంచు విష్ణు సింగపూర్ లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా రాలేకపోతున్నామని ఆయన వివరించారు. తన అన్నగారైన నందమూరి తారక రామారావుగారి మనవడు తారకరత్న తనకు, తన కుటుంబానికి అత్యంత ఆత్మీయుడని చెప్పారు. ఆయన ఎంత మంచి వ్యక్తో, సౌమ్యుడో చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.