Pawan Kalyan: నాలుగేళ్ల కిందట నన్ను కలిసిన చిన్నారి ఇప్పుడు లేదని తెలిసి మనసు కలచివేసింది: పవన్ కల్యాణ్

  • గతంలో పవన్ ను కలిసిన రేవతి అనే చిన్నారి
  • మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న బాలిక
  • మూడ్రోజుల కిందట మృతి చెందిందన్న పవన్
Pawan Kalyan says a girl who met him four years back is died

అరుదైన వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన ఓ చిన్నారి గురించి జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. నాలుగేళ్ల కిందట ఎస్.రేవతి అనే చిన్నారి తనను కలిసిందని, ఇప్పుడా బాలిక లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. 

మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన ఆ చిన్నారి అనారోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఎంతో నిబ్బరంగా ఉన్న వైనం తనను అబ్బురపరిచిందని పేర్కొన్నారు. ఆ బాలిక భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించానని పవన్ వివరించారు. 

అయితే, తనకున్న వ్యాధి కారణంగా ఆ చిన్నారి మూడ్రోజుల కిందట 12 ఏళ్ల వయసుకే శివైక్యం చెందిందని వెల్లడించారు. ఈ విషయం తన మనసును తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

More Telugu News