పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు

Earth tremors in Pulichinthala Project Areas
  • ఉదయం 7.26 గంటల సమయంలో భూ ప్రకంపనలు
  • ఆందోళనలో ప్రాజెక్టు సమీప ప్రాంతాల ప్రజలు
  • ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్న గ్రామస్థులు
పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో ఈ ఉదయం స్వల్పంగా భూ ప్రకంపనలు కనిపించాయి. ఉదయం 7.26 గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో  కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు.

మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే అవి స్వల్ప ప్రకంపనలేనని, భయపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు. భూ ప్రకంపనలపై సమాచారం అందుకున్న అధికారులు ఆయా ప్రాంతాల పరిశీలనకు బయలుదేరినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Pulichinthala Project
Earthquake
Palnadu Dist
Earth Tremors

More Telugu News