అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లను అమ్మేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్
- అట్టా, ఉప్పు అమ్మకాల్లో పేరుమోసిన బ్రాండ్లు అన్నపూర్ణ, కెప్టెన్ కుక్
- రూ. 60.4 కోట్లకు అమ్మేస్తున్న హిందుస్థాన్ యూనిలీవర్
- నాన్ కోర్ కేటగిరీల నుంచి తప్పుకోవడానికే అని ప్రకటన
2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్ల టర్నోవర్ రూ. 127 కోట్లుగా ఉంది. మొత్తం హిందుస్థాన్ యూనిలీవర్ టర్నోవర్ లో ఇది ఒక శాతానికి సమానం. నాన్ కోర్ కేటగిరీల నుంచి తప్పుకోవడానికే వీటిని అమ్మేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ రెండు బ్రాండ్లను హిందుస్థాన్ యూనిలీవర్ ప్రారంభించింది.